Friday, April 26, 2024
Friday, April 26, 2024

గ్రామ కమిటీలే జనసేన పార్టీకి పునాదులు….

జుత్తుగ నాగరాజు….

విశాలాంధ్ర-ఉండి : గ్రామ పార్టీ కమిటీలే జనసేన పార్టీకి పునాదులని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు అన్నారు .క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామ పార్టీ కమిటీలను నియమించడం జరుగుతుందని జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇంచార్జ్ జుత్తిగ నాగరాజు అన్నారు. సోమవారం సాయంత్రం మండలం వాండ్రంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గొట్టుముక్కల సుబ్బరాజు అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుత్తుగ నాగరాజు,రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కార్యదర్శి తోట వాసు, చనమల్ల చంద్రశేఖర్,జిల్లా ప్రధాన కార్యదర్శి గవర లక్ష్మీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో పార్టీ బలోపేతం అయితేనే నియోజకవర్గం లో పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. యువతను వైసీపీ మోసగించిందని విమర్శించారు. యువత గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేయాలన్నారు. అనంతరం పార్టీ గ్రామ కమిటీ నూతన అధ్యక్షునిగా రెడ్డిపల్లి శ్రీహరి కృష్ణ ను నియమించారు. ఉపాధ్యక్షులుగా బొంగురోతు నారాయణ, కర్రి రాజేష్, ప్రధానకార్యదర్శులుగా ముప్పిడి కిషోర్, విజ్జిరోతి దినేష్, పాలపర్తి ప్రసాద్, పచ్చా సురేష్, కార్యదర్శులుగా కొరకూటి తేజ, సందాక సాయికిరణ్, కిల్లి దుర్గాప్రసాద్, గల్లా రవీందర్, గోపిశెట్టి వర ప్రసాద్, పర్వతాల గౌరీ శంకర్, సంయుక్త కార్యదర్శులుగా సందాక అశోక్, పాలపర్తి సతీష్, నరేందర్, బొంగురోతు ప్రసాద్, అలుగోలు ప్రసాద్, సుంకర సతీష్, కె. వీరాంజనేయులు, దుర్గా ముకేష్, శ్రీకాంత్, కత్తుల లను నాగరాజు నియమించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు గేదెల నరసింహులు, కార్యదర్శి బ్రహ్మానందం, నాయకులు యర్రా రవి, అడపా గణేష్, పెద్దపాటి ప్రసాద్, కురిటి అప్పారావు తదితర నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img