Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పోతుల అన్నవరం

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ : తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పోతుల అన్నవరంను నియమించినట్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెం నాయుడు నియామక ఉత్తర్వులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా అచ్చెం నాయుడును కలిసి పోతుల అన్నవరం కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పోతుల అన్నవరం ప్రస్తుతం పెదతాడేపల్లి గ్రామ సర్పంచ్గా ఉన్నారు. గతంలో పోతుల అన్నవరం ఎ.ఎం.సి. ఛైర్మన్, జెడ్పిటిసి సభ్యునిగా, మండల పరిషత్ అధ్యక్ష పదవి నిర్వహించారు. రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉంటూ క్రీయాశీలక సభ్యులుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా పోతుల అన్నవరం మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకంతో ఇచ్చిన పదవిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు. గ్రామాల్లోని యువతను, తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను మమేకం చేసి పార్టీ పటిష్ఠతకు గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. పదవి రావడానికి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాల్జీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గొర్రెల శ్రీధర్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, రామ్ ప్రసాద్ చౌదరి, ముప్పిడి రమేష్, మాజీ కౌన్సిలర్లు పోతుల అన్నవరంను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img