ఓ…బాదితురాలి ఆవేదన…
విశాలాంధ్ర / చాట్రాయి : అయ్యా….ప్రమాదంలో….మా అబ్బాయి మరణించి మూడేళ్లు గడిచిపోయింది.అయినా నేటికి బీమా రాలేదు ఇప్పించండయ్యా…. అంటూ ఓ బాదితురాలు మొరపెట్టుకున్న వైనమిది. బుధవారం మధ్యాహ్నం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న ఎంపీడీవో మురళీమోహన్ వద్దకు చనుబండ పంచాయతీ సూరం పాలెం గ్రామానికి చెందిన కుక్కరపాటి లక్ష్మీ అనే బాధిత మహిళతన దీనగాధను వివరించింది. మూడేళ్ళ క్రితం ప్రమాదంలో చేతికొచ్చిన నా కొడుకు చనిపోయాడు. రెక్కాడితే గాని డొక్కనిండని నిరుపేదను నేను. దుర్బరమైన జీవితం గడుపుతున్నాం. నా కొడుకుకి రావలసిన బీమా ఇప్పించండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన ఎంపీడీవో మురళీమోహన్ సంబంధిత శాఖల వారికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. ఏ పథకం రావాలన్నా ప్రభుత్వం నిబంధన మేరకే ఆధారపడి ఉంటుందని
మరోసారి పై అధికారులకు తెలియజేయాలని వివరించారు.