Friday, April 26, 2024
Friday, April 26, 2024

మంత్రిని కలిసిన వెలమ సంక్షేమ సంఘ నాయకులు

పెంటపాడు గ్రామానికి చెందిన వెలమ సంక్యేమా నాయకులు మంగళవారం తన క్యాంపు కార్యాలయం లో కలిశారు.ఈ సందర్బంగా గ్రామ ఇలావేల్పు గౌరీదేవి అమ్మవారి ఆలయ నిర్మాణంకోసం కమిటీ చేస్తున్న కృషికి దేవదయ శాఖ నుండి నిధులు అందించాలని వారు,దేవాదాయ శాఖ మంత్రి, మరియు ఉపముఖ్యమంత్రి కొట్టు. సత్యనారాయణ ను కోరారు.దీనికి మంత్రి కొట్టు సత్యనారాయణ సానుకూలంగా స్పందించారు. కాగా గ్రామస్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటురాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ys జగన్మోహనరెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్వాగత్తించాలని, పార్టీ ల కాతీతంగా అందరు కలిసి మెలిసి ఉండాలని ఈ సందర్బంగా సూచించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ను కలిసిన వారిలోపెంటపాడు మాజీ జడ్పీటీసీ సభ్యులు కిలాపర్తి. వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యులు రెడ్డి సూరిబాబు, దాసరి. నరేష్, వార్డ్ సభ్యులు బర్ల. జయరాంబాబు, రెడ్డి. శ్రీను, కేబుల్ ఆపరేటర్ సంఘ రాష్ట్ర నాయకులు శిరపు. వెంకట్రావు, నాలం. వెంకటేశ్వరావు, ఇతర వెలమ సంక్యేమా నాయకులు పాల్గున్ని మంత్రిని శాలువాలతో సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img