Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఇది వారి పైశాచిక దాడికి నిదర్శనం : లోకేష్‌

ప్రజాధనం దోచి దాచుకునే వైసీపీ నేతలకు, నీతి నిజాయితీ – దానం గుణం గల మహారాజు అశోక్‌ గజపతిరాజు గొప్పతనం తెలియదని టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అన్నారు. ధర్మాన్ని పాటించని జగన్‌ రెడ్డికి అనువంశిక ధర్మకర్తని గౌరవించడం ఏం తెలుస్తుంది? అని అన్నారు. గాడిదకు గంధం వాసన తెలియనట్టే! అని అన్నారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు తెలియకుండానే బోడికొండపై రామాలయ నిర్మాణం తలపెట్టడం, నిబంధనలు ఉల్లంఘనపై ప్రశ్నించిన రాజుపైనే కేసు నమోదు చెయ్యడం హిందూ ధర్మంపై జరుగుతున్న పైశాచిక దాడికి నిదర్శనమని అన్నారు. ఆలయాలకు రక్షణ కల్పించడంలో విఫలమైన మంత్రులు ఇప్పుడు ఏకంగా దేవాలయాల సంప్రదాయాలు పాటించకుండా అపచారం తలపెడుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img