తెలంగాణ రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోంఐసోలేషన్లో చిక్సిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మధ్య తనను కలిసినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగారాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,825 మందికి పాజిటివ్గా తేలింది. మరోవైపు 351 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు.