ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారని పీఎంవో ట్వీట్ చేసింది. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవార్, మోదీ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిరది.ఈ నెల 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూశ్ గోయల్ కూడా పవార్తో శుక్రవారం సంప్రదింపులు జరిపారు.