Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

కాంగ్రెస్‌ వల్లే నేను రాజ్యసభకు రాగలిగా : విజయసాయిరెడ్డి

కాంగ్రెస్‌పార్టీ ఆనాడు తమపై తప్పుడు కేసులు బనాయించడం వల్లనే తాను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు.ఆయనతోపాటు రానున్న రెండు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న వెంకయ్యనాయుడు నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. చెన్నైలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు విజయసాయి అన్నారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేష్‌కు, అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్‌ సభ్యుడు నరేష్‌ గుజ్రాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రిటైర్‌ అవుతున్న సహచర సభ్యులందరికీ విజయసాయి హృదయపూర్వక వీడ్కోలు, అభినందనలు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img