ఎల్బీనగర్ పరిధిలోని గడ్డి అన్నారంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్బీనగర్ టిమ్స్ను 21,36 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించింది. 14 అంతస్తుల్లో వెయ్యి పడకలతో ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు.