షర్మిల సభలో రసాభాస
విశాలాంధ్ర/ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన వైఎస్ షర్మిల సభలో రసాభాస జరిగింది. అయితే రసాభాసకు కారణం టీఆర్ఎస్ కార్యకర్తలు అని షర్మిల మనుషులు ఆరోపిస్తుండగా, డబ్బులు ఇస్తామని సభకు జనాన్ని తరలించిన షర్మిల మనుషులు.. సభ ముగిసిన తర్వాత డబ్బులు అడిగితే వారిపై దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, అక్కడ జరిగిన గొడవలో మహిళలు, యువకులు, షర్మిల అనుయాయుల నడుమ వాగ్వాదం జరిగింది. కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనలో కొంతమంది గాయపడినట్లు సమాచారం.