Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

బీజేపీ, కాంగ్రెస్‌ వస్తే చీకటి రోజులే : హరీశ్‌రావు

బీజేపీ, కాంగ్రెస్‌ వస్తే చీకటి రోజులే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ మహతి ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులకు నిర్వహించిన వానాకాలం సాగుకు సన్నాహక సమావేశంలో మాట్లాడిన హరీశ్‌రావు.. వచ్చే వానాకాలం ఏ పంటలు వేస్తే రైతులకు మేలు జరుగుతదో ఆలోచించాలన్నారు. గతంలో ఎండాకాలం వచ్చింది అంటే అంబలి కేంద్రాలు, రైతుల ఆత్మహత్యలు, ధర్నాలు ఆందోళనలు ఉండేవని కానీ ఐదేళ్లలో మార్పు తెచ్చామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్‌ కోతలు, కష్టాలు, కన్నీళ్లు..వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‌, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు..అత్యధికంగా రైతు ఆత్మహత్యలను తగ్గించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ అని కేంద్రం చెప్పిందని అన్నారు. బీజేపీ అధికారంలో వస్తే ఉచిత కరెంట్‌ వస్తాదా ఆలోచించాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఇచ్చినట్లు ఉచిత కరెంట్‌, రైతు బంధు, బీమా కోసం డిమాండ్‌ చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img