Monday, May 6, 2024
Monday, May 6, 2024

అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలి : సీఎం జగన్‌

అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ, స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. స్కూళ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌ ను ఏప్రిల్‌ చివరి నాటికే సిద్ధం చేయాలన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ లు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం టీవీల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img