Monday, May 6, 2024
Monday, May 6, 2024

అన్నా క్యాంటీన్ ను విధ్వంసం చేసిన వైకాపా గూండాలను తక్షణమే అరెస్ట్ చేయాలి

టిడిపి సీనియర్ నాయకులు

విశాలాంధ్ర -రాజంపేట: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ను విధ్వంసం చేసిన వైకాపా గూండాలను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు డిమాండ్ చేశారు. గురువారం విలేఖరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు 5 రూపాయలతో భోజనం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, దీన్ని జీర్ణించుకోలేని వైకాపా గుండాలు కొందరు అన్నా క్యాంటీన్ ను విధ్వంసం చేయడం దారుణమైన చర్య అని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో సామాన్య ప్రజల పైన వైకాపా గుండాలు చేస్తున్న దాడులు కూడా అధికమయ్యాయిని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img