Monday, May 6, 2024
Monday, May 6, 2024

కొనుక్కొన్న ఇళ్లుస్థలంను ఇప్పించండి

స్పందనలో బిఎస్ఎఫ్ జవాన్ విజ్ఞప్తి

విశాలాంధ్ర, పార్వతీపురం: దేశరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న తాను తనజీతం డబ్బులతో కొనుక్కొన్న ఇంటిస్థలం ఇప్పించండని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ఒక బి ఎస్ ఎఫ్ జవాన్ తన భార్యతో కలిసి వచ్చి స్పందనలో దరఖాస్తు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరైనా గ్రీవెన్స్ సెల్ కోసం రాక తప్పదని వారిని చూసిన వారంతా చర్చించు కోవడం గమనార్హం. వివరాలు పరిశీలిస్తే జియ్యమ్మవలస మండలంలోని గవరమ్మపేట గ్రామానికి చెందిన నారంశెట్టి శంకరరావు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్ గా పనిచేస్తున్నారు. అతడు తన భార్య నారంశెట్టి స్రవంతి పేరుమీద పార్వతీపురం పట్టణంలో 2018లో 211చదరపు గజాల స్థలాన్ని సర్వే నెంబర్ 384 లో1 స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆస్తలంలో ఇళ్లు నిర్మాణము కోసం పలు సార్లు అయన ప్రయత్నించగా పలువురు అతన్ని అడ్డుకుంటున్నారని తెలిపారు. తనకు న్యాయం చేసి తాను కొనుగోలు చేసిన స్థలాన్ని అప్పగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేయడానికి ఈరోజున వచ్చానని అయన విలేకరులకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img