ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.ఈ మేరకు సెప్టెంబర్ 5న ప్రభుత్వ సత్కారాలు, సన్మానాల తిరస్కరణకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పిలుపునిచ్చింది. ఏపీలో ఉపాధ్యాయులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన ఏపీటీఎఫ్… అందుకు నిరసనగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిరసనలో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడులను బహిష్కరించడంతో పాటుగా ప్రభుత్వం నుంచి అందే సన్మానాలను కూడా తిరస్కరించాలని ఏపీటీఎఫ్ నిర్ణయించింది. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టడాన్ని కూడా ఏపీటీఎప్ తీవ్రంగా ఖండిరచింది. ఉపాధ్యాయులపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే… ఏపీటీఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) కూడా మద్దతు తెలిపింది. సోమవారం నాటి ఉపాధ్యాయ దినోత్సవాలకు హాజరు కారాదని తన సభ్యులకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.