Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మానసికవికాసానికి క్రీడలు దోహద పడతాయి

విశాలాంధ్ర,సీతానగరం: విద్యార్ధుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహద పడతాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టరు ఎస్ డి వి రమణ తెలిపారు.శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఆటలపోటీలను ఆయన ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధ్యార్ధులు క్రీడల పట్ల అవగాహన పెంచుకొని ఆదిశగా ఉన్నత స్థానాలను చేరుకోవాలని కోరారు.త్రోబాల్ బ్యాడ్మింటన్,టెన్నిక్వేట్ ఆటలపోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈపోటీల కార్యక్రమాల్లో హెచ్ఎం ఇల్లా ప్రసన్నలక్ష్మి , ఉపాధ్యాయుల జగన్నాథరావు, పిఅర్టీయు జిల్లా అధ్యక్షులు వోలేటి తవిటినాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.శ్రీనివాసరావు, గాంధీ,తిరుపతిరావు, వాసు,వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డిఈఓకు బైజుస్ ఆప్ విషయములో మేమోలు జారీచేసిన అంశం, పలు ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టిలో పెట్టినట్లు వోలేటి తవిటినాయుడు విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img