Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పరిసరాల పరిశుభ్రతతో అనారోగ్యాలు దూరం

విశాలాంధ్ర-రాప్తాడు : పరిసరాల పరిశుభ్రతతో అనారోగ్యాలు దూరమవుతాయని రాప్తాడు జెడ్పీటీసీ పసుపుల హేమావతి తెలిపారు. ఎన్‌ ఎస్‌ ఎస్‌ స్పెషల్‌ క్యాంపులో భాగంగా శనివారం మరూరు గ్రామంలో పర్యావరణం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రహదారలరులపై చెత్తను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ వీబీఆర్‌.శర్మ, చైర్మన్‌ బీ.వీ.క్రిష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ వెన్నెపూస రవీంద్రరెడ్డి, సర్పంచ్‌ ప్రభావతి, సీ.ఈ.ఓ ఆనందకుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.సూర్యశేఖర రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఎం. శ్రీనివాసులు నాయక్‌, పిడి రమేష్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img