రూ.20కోట్లతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రమేశ్బాబు కృతజ్ఞతలు తెలిపారు.