విశాలాంధ్ర=పెనుకొండ : నగర పంచాయితీ ఒకటవ వార్డు ఇస్లాపురంలో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతుండగా ట్యాంకర్ ద్వారా మంచి నీటిని సరఫరా చేసిన తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ, వార్డ్ కౌన్సిలర్ గీత హనుమంతు మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నందున కౌన్సిల్ సమావేశంలో ఎన్నిసార్లు విన్నవించిన ఏదో కుంటి సాకులు చెబుతూ గ్రామానికి తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో సవితమ్మతో మాట్లాడి తాగునీటి సరఫరాకు టాంకర్ పంపించాలని అడగగానే మంచి మనసుతో ఆమె నీటి సరఫరా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపామని ఆయన తెలిపారు.