Monday, May 6, 2024
Monday, May 6, 2024

పట్టభద్రుల వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను గెలిపించండి

విశాలాంధ్ర,సీతానగరం: మూడు జిల్లాల శాసనమండలి పట్టభధ్రుల వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న  సీతంరాజు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని మండల వైఎస్ఆర్సీపీ కీలక నేతలు పిలుపునిచ్చారు.బుధవారం ఎమ్మెల్యే జోగారావు అదేశాలు మేరకు కొత్తవలస, గెడ్డలుప్పి, బల్లకృష్ణా పురం, బగ్గందొరవలస, తామరఖండి, బక్కుపేట గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మార్చి13న జరగబోవు పట్టభద్రుల ఎన్నికలలో మనప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ కట్టబెట్టాలని కోరారు. ప్రతీగ్రామంలో నమోదయిన పట్టభద్రులు ప్రతీఒక్కరినీ వారిఇంటింటికివెళ్లి ప్రత్యక్షంగా కలుసుకొని కరపత్రాలనుఅందచేసి 1ప్రాధాన్యత ఓటు మనఅభ్యర్థికి వేయాలని కోరారు.
మండలంలో లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నికలు జరిగేవరకు ప్రతీరోజు ఓటర్లను కలుస్తూ వారిఓటు వైఎస్సార్సీపీ అభ్యర్థికే వేసేటట్లు కృషి చేస్తామని చెప్పారు.ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, పార్టీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు,జడ్పీటీసీ మామిడి బాబ్జీ, వైస్ ఎంపీపీ సూర్యనారాయణ, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, మండల వైసిపి సీనియర్ నాయకులు అంబటి కృష్ణం నాయుడు, తెంటు వెంకటఅప్పలనాయుడు, ఆర్వీ పార్థసారథి,రత్నాకర్, గాజాపు శ్రీనివాసరావు, నదిమింటి రామకృష్ణ,మండల జేసిఏస్ కన్వీనర్ యు సురేష్ కుమార్ ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు,సచివాలయం కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img