జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విశాలాంధ్ర -విజయనగరం : ఈ ఏడాది అంతా జిల్లా ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆకాంక్షించారు. శోభకృతు నామ ఉగాది సందర్భంగా ఆమె జిల్లా ప్రజలకు ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా ప్రకృతి అనుకూలించి, పంటలు బాగా పండాలని, ఆయురారోగ్యాలు సిద్దించాలని, జిల్లా అభివృద్ది పథాన పయనించాలని కోరారు. ఎటువంటి ఆపదలు రాకుండా, ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం ప్రజల వెంటే ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్ధులు పరీక్షల్లో మంచి విజయాలను, జిల్లా క్రీడాకారులు పోటీల్లో ఘనవిజయాలను సాధించి, మన జిల్లాకు గొప్ప పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. రెట్టించిన ఉత్తేజంతో, సరికొత్త ఆశలతో, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కలెక్టర్ సూర్యకుమారి పిలుపునిచ్చారు.