Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఈబిసి నేస్తంతో పేద మహిళలకు ఆర్థిక చేయూత

-మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

అగ్రవర్ణాల్లో నిరుపేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్సార్

విశాలాంధ్ర -ఉరవకొండ: ఈబీసీ నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. స్థానిక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఈ బీసీ నేస్తం లబ్ధిదారులతో కలిసి ఆయన సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, వెలమ తదితర వర్గాలకు చెందిన 4,39,068 మంది అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున రెండో విడతగా కలుపుకుని రూ.1250 కోట్లు వారి ఖాతాల్లో జమచేశారని వెల్లడించారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత, ఎంపీడీవో స్థానిక ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులతో పాటు వార్డు సభ్యులు, ఎంపిటిసిలు, వైస్సార్సీపీ నాయకులు,సచివలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img