Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఆపదలో ప్రాణదాతగా నిలుద్దాం

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : ఆపదలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలుద్దామని మానవత రక్తదాతల సంస్థ కన్వీనర్ తరిమెల అమర్నాథ్ రెడ్డి, కళాశాల కళాశాల చైర్మన్ అనంత రాముడు పేర్కొన్నారు. బుధవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో రక్త గ్రూప్ నిర్ధారణ శిబిరం, రక్తదానం పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్త గ్రూపు విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరు నిర్ధారించుకుని .. అత్యవసర పరిస్థితుల్లో తోటి వారికి తమ వంతు సహాయాన్ని సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరావు ఖోఖిలే , అధ్యాపక బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img