Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బాధిత వ్యక్తి సమగ్ర సమాచారం.. హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డ్‌లో


గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
భవిష్యత్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు పరీక్షలు చేసి వైద్యం చేయడానికి ఆలస్యం జరగకుండా హెల్త్‌ కార్డ్‌ చూసిన వెంటనే వైద్యం చేసే విధంగా బాధిత వ్యక్తి సమగ్ర సమాచారం హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డ్‌లో పొందుపరుస్తారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.హెల్త్‌ ప్రొఫైల్‌ చేయడానికి సీఎం కేసీఆర్‌ ములుగు జిల్లాను ఎంపిక చేశారని తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల విద్య, వైద్య-ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంలో ఈ విషయాలను మంత్రి వెల్లడిరచారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ చేయడానికి ములుగు జిల్లాను ఎంపిక చేశారన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభం అవుతున్నాయి. వీటితో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. స్కూల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభం కోసం తీసుకునే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img