హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.రూ.500 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసింది.ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లతో కలిపి మొత్తం రూ.2 వేల కోట్లు రిలీజ్ అయ్యాయి.