Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

రానున్న ఎన్నికల్లో 400 స్థానాల్లో మాదే విజయం..


: అఖిలేశ్‌ యాదవ్‌

రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఎస్పీ కూటమికి 400 స్థానాల్లో విజయాన్ని అందిస్తారని ఆ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఓ న్యూస్‌ చానల్‌ లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, సీఎం యోగి ఆదిత్యానాధ్‌ సారధ్యంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని కాషాయ పార్టీకి ఓటమి ఎదురవనుందని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను చెత్తబుట్టలో పడేసిన బీజేపీ పట్ల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ పోరాడే విధానం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ కొత్త డిమాండ్లు ఉంటాయన్నారు. సమాజంలో అన్ని వర్గాలను గౌరవించే పార్టీకే ఈసారి ప్రజలు అధికారం కట్టబెడతారని అన్నారు.రైతులను గౌరవించేవారికి, ఉద్యోగాలు ఇచ్చేవారికి ఓటు వేస్తారని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీకి, దాని మిత్ర పక్షాలకు ప్రజలు ఈసారి 400 స్థానాలను ఇస్తారన్నారు. యూపీ ఎన్నికల్లో పెద్ద పార్టీలతో తాము జట్టుకట్టబోమని, చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని తన అనుభవం ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. కేవలం చిన్న పార్టీలను ఓ వేదికపైకి తేవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img