Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలుగుజాతి వెలుగుదివ్వె దివంగత ఎన్టీఆర్

విశాలాంధ్ర-రాప్తాడు : ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన దివంగత మహానేత ఎన్టీఆర్ అని టీడీపీ నాయకులు అన్నారు. రాప్తాడు టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్, పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు అసలు సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్‌ అని, ఆంధ్రప్రదేశ్‌ లో, అతని సమకాలీకుల్లో అంతటి ప్రజానాయకుడు మరొకరు లేరని కొనియాడారు.వందేళ్ల కాంగ్రెసు పార్టీకి ఏపీలో ధీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పనేత ఎన్టీఆర్‌ అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, సర్పంచులు బండి ఉజ్జినప్ప, మిడతల శీనయ్య, సాకే తిరుపాలు, ఎంపీటీసీ జాఫర్, మాజీ కన్వీనర్ గజ్జల నారాయణస్వామి, మరూరు గోపాల్, కురుబ సాధికారత రాష్ట్ర కన్వీనర్ గంగలకుంట రమణ, బిసి సెల్ ఆర్గనైజింగ్ కన్వీనర్ గంగలకుంట కిష్ట, పుల్లలరేవు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img