Friday, April 26, 2024
Friday, April 26, 2024

మాజీ ఎంపీ కుటుంబానికి న్యాయం జరిగింది

పొగాకు రామచంద్ర

దివంగత బీసీ నేత, మాజీ ఎంపీ సానిపల్లి గంగాధర్ సతీమణి మంగమ్మకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించడంతో మాజీ ఎంపీ కుటుంబానికి న్యాయం జరిగిందని వాల్మీకి ఎస్టీ సాధన రాష్ట్ర నేత, పెనుకొండ నియోజకవర్గం వైసిపి నాయకులు పొగాకు రామచంద్ర సోమవారం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా ఆవిర్భావం ప్రారంభంలో 2012- 2014 సంవత్సరాల మధ్య మాజీ ఎంపీ గంగాధర్ సతీమణి మంగమ్మ పెనుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారన్నారు. వాల్మీకి కులంలోని ఒక వర్గం వ్యతిరేకించడంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ నారాయణను పెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించారన్నారు. సానిపల్లి మంగమ్మ కష్టాన్ని గుర్తించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకిలను గుర్తించిన సీఎంకి వచ్చే ఎన్నికలతోపాటు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img