Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

నూతన రైల్వే జిఆర్పి ఎస్సైగా.. కే .గోపి కుమార్ బాధ్యతల స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని రైల్వే విభాగంలో రైల్వే జీఆర్పి ఎస్ఐగా. కె. గోపి కుమార్ శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఉన్న ఎస్సై నాగప్ప గుత్తి కు బదిలీగా వెళ్లారు. అనంతరం గోపి కుమార్ మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రతే మా లక్ష్యంగా నా విధులను కొనసాగిస్తానని తెలిపారు. రైల్వే సిబ్బంది సహాయ, సహకారాలతో రైల్వే ప్రయాణికులకు భద్రత కూడా కల్పిస్తామని తెలిపారు. రైల్లో ప్రయాణించినప్పుడు ప్రయాణికులు అపరిచిత వ్యక్తులతో పరిచయం ఉండరాదని, ఒకవేళ పరిచయం ఏర్పరచుకుంటే దొంగతనాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. రైల్వే పోలీసులు ఇచ్చే సలహా, సూచనలను పాటిస్తే ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణాన్ని చేయవచ్చు నన్నారు. తదుపరి జిఆర్పి పోలీస్ సిబ్బంది ఎస్సై కు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img