Friday, April 26, 2024
Friday, April 26, 2024

మున్సిపల్ చైర్మన్ పదవి బాధ్యతలను స్వీకరించిన కాచర్ల లక్ష్మి

శివానగర్లో ప్రత్యేక పూజలు-భారీ ర్యాలీ నడుమ మున్సిపల్ ఆఫీసుకు చేరిక

ఎమ్మెల్యే కేతిరెడ్డికి, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మికి గజమాలల తో ఘన స్వాగతం పలికిన అభిమానులు

పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను.. నూతన మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి.

విశాలాంధ్ర- ధర్మవరం : మున్సిపల్ చైర్మన్ గా కాచర్ల లక్ష్మి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో తన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా తొలుత శివానగర్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను చైర్మన్ కాచెర్ల లక్ష్మి, భర్త కాచర్ల అంజి నిర్వహించారు. ఈ పూజలో వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజు, మాజీ వైస్ చైర్మన్లు చంద్రమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్ లతోపాటు పట్టణ వార్డు కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు. అనంతరం వందలాదిమంది అభిమానులు, శ్రేయోభిలాషులు, వైఎస్సార్సీపి నాయకులు, కార్యకర్తల నడుమ భారీ ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కేతిరెడ్డికి, మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మికి అభిమానులు గజమాలలతో పూల వర్షముతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కేరళ వాయిద్యాల నడుమ టపాసులను పేలూస్తూ, ర్యాలీని విజయవంతం చేయుటలో వారికి వారే సాటిగా నిలిచారు. అనంతరం చైర్మన్ కాచర్ల లక్ష్మి మాట్లాడుతూ ఈ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే, కౌన్సిలర్ల సహకారంతో, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారాల అందించిన నాయకులకు కార్యకర్తలు ప్రోత్సాహం అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయమును చేయుటలో తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మార్గదర్శనముతో కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్ల సహకారంతో పట్టణ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వార్డు ప్రజలు తమకున్న సమస్యలను నేరుగా గాని, కౌన్సిలర్ల ద్వారా గాని తెలియజేస్తే పరిష్కరిస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జ్ నాయకులు, వందలాదిమంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img