Friday, April 26, 2024
Friday, April 26, 2024

నులి పురుగుల నివారణ లక్ష్యము

స్పెషల్ నోడల్ ఆఫీసర్ రామాంజనేయులు

విశాలాంధ్ర – ధర్మవరం : నులిపురుగుల నివారణే మా లక్ష్యమని స్పెషల్ నోడల్ ఆఫీసర్ రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డి వార్నింగ్ డే ను పురస్కరించుకొని మంగళవారం మండల పరిధిలోని దర్శనమల పరిధిలోగల ఏలుకుంట్ల గ్రామం, నేలకోట తండా, బిల్వంపల్లి ,దర్శనమల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్స్ హైస్కూల్లో జరుగుతున్న డి వార్నింగ్ కార్యక్రమాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నులి పురుగుల వలన కలుగు నష్టాలను వాటికి తగిన సలహాలను ఇవ్వడం జరిగింది అని తెలిపారు. చేతుల పరిశుభ్రత కూడా ప్రతిరోజు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలుకుంట్ల పంచాయతీ కార్యదర్శి. చంద్రిక, ఏపీవో.. అనిల్ కుమార్ రెడ్డి, ఏనుగుంట్ల గ్రామ సర్పంచ్ గంగమ్మ, వైద్యాధికారులు పుష్పలత దిలీప్ కుమార్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కళావతి హెల్త్ సూపర్వైజర్లు వెంకట్రాముడు జయకుమారి ఆంజనేయ కామేశ్వరి ఎంఎల్హెచ్పిలు, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img