విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని ఎస్ ఎస్ జిఎస్ డిగ్రీ కళాశాలలో సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిని మొదటి ఓటు వేసి గెలిపించాలని సిపిఐ నాయకులు ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, ఎఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర ,సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ప్రజానాట్యమండలి మండల కార్యదర్శి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.