విశాలాంధ్ర`ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు గురువారం పట్టణములోని బాబు జగ్జీవన్ రామ్నగర్లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో నాలుగవ రోజు కవి సమ్మేళనం ఘనంగా పాఠకులు మధ్య నిర్వహించుకోవడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. తదుపరి కవులు నాగరాజు, ఆదినారాయణ, కవి సమ్మేళనం పై పాఠకులకు, విద్యార్థులకు వివరణ ఇచ్చారు. తదుపరి విద్యార్థులు పద్యాలు, గ్రంథాలయముపై కవితను వినిపించారు. తెలుగు పండిట్ ఆదినారాయణ వినిపించిన కవిత్వ గేయాలు, అందరినీ ఆకట్టుకున్నాయి. తదుపరి విద్యార్థులు డిజిటల్ గ్రంథాలయం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 50 మంది విద్యార్థులు వక్తృత్వ పోటీలో పాల్గొనగా, జడ్జిలుగా రాజారెడ్డి, రామాంజనేయులు, హరి పాల్గొనీ, ప్రతిభ గల వారిని ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శివమ్మ ,రమణ నాయక్, గంగాధర్, టీచర్లు ముత్యాలప్ప ,సుధా, విద్యార్థులు పాల్గొన్నారు.