తాలూకా కార్యదర్శి జే. మల్లికార్జున
విశాలాంధ్ర`ఉరవకొండ : సిపిఐ పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 26వ తేదీన అన్ని మండల కేంద్రాలలో కూడా ఘనంగా నిర్వహించాలని సిపిఐ పార్టీ ఉరవకొండ తాలూకా కార్యదర్శి జే.మల్లికార్జున పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల కేంద్రాల్లో సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించాలని అలాగే 97 సంవత్సరాల కాలంలో సిపిఐ పార్టీ సాధించిన విజయాలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, రైతు కూలీల కోసం సిపిఐ పార్టీ నిర్వహించిన పోరాటాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తాలూకా సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్, వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్, పార్టీ నాయకులు గణప మల్లికార్జున, షేక్ రజాక్, మహిళా సమైక్య నాయకులు, వన్నూరమ్మ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు