ఎంపీ మిథున్రెడ్డి
చంద్రబాబు నాయుడు ఆంగ్లబోధనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు కొడుకు లోకేష్, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు గానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా అని ప్రశ్నించారు. విద్యకు సీఎం వైఎస్ జగన్ ఆధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.