: సీఎం జగన్
పిల్లల కోసం నాడు-నేడుతో మంచి కార్యక్రమం చేపట్టామని, నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని, అప్పుడే మొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.