రాష్ట్రంలో ఏం ఘనకార్యాలు చేశారని వలంటీర్లకు సేవా సత్కారాలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అధికార పార్టీకి సేవలందించినందుకు ప్రజల సొమ్ము దోచిపెడతారా అని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ కార్యకర్తల సన్మానానికి ఫుల్ పేజి అడ్వర్టయిజ్మెంటు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అడ్డగోలు దోపిడీకి సహకరించినందుకు, దొంగమద్యం అమ్మినందుకు సన్మానిస్తున్నారా అని ఆయన ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.