Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో రెండ్రోజులపాటు వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడి క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్రలో రెండ్రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. ఇక అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని దీనివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని, మత్స్యకారులెవ్వరూ రాగల రెండు రోజులపాటు వేటకు వెళ్లద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img