Friday, April 26, 2024
Friday, April 26, 2024

బీజేపీ నేతలది తప్పుడు ప్రచారం

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కేంద్రం ఆదేశాలతో వినాయక చవితి వేడుకలపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కర్నూలులో సోము వీర్రాజువి రాజకీయ డ్రామాలని విమర్శించారు. ఏపీలో వినాయకచవితి పండుగ చేసుకోకూడదని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు.దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..మతం ముసుగులో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగలు చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని అన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌ లైన్స్‌ మేరకే గణేశ్‌ ఉత్సవాలపై నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వమే కోవిడ్‌ గైడ్‌లైన్స్‌ ఇచ్చిందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img