కేంద్ర ఆర్థికశాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించిరూ.4 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ పార్లమెంటులో ప్రకటించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రు.54,369.18 కోట్ల ఆర్థిక లోటు ఉందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని కేంద్రం తెలియజేసింది. 15వ ఆర్ధిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికిగాను రూ. 30,305 కోట్ల అప్పునకు అనుమతి కోరిందని కేంద్రం పేర్కొంది. కొవిడ్ కారణంగా మరో రూ.19,192 కోట్ల అప్పునకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.