స్పందన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
కొవిడ్పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానంతో ఎవరైనా వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలన్నారు.స్పందన కార్యక్రమంపై ఆయన మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ను బాగా అరికట్టగలిగామన్నారు. కొవిడ్పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ-క్రాప్పై దృష్టి ఉంచాలని సూచించారు. కచ్చితంగా అడ్వైజరి సమావేశాలు జరగాలని సీఎం స్పష్టం చేశారు. జగనన్న పచ్చతోరణం కింద ఆగస్టు 15 నుంచి 31 వరకు కోటి మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.