Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

కొవిడ్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి

స్పందన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌
కొవిడ్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానంతో ఎవరైనా వస్తే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయాలన్నారు.స్పందన కార్యక్రమంపై ఆయన మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్‌ను బాగా అరికట్టగలిగామన్నారు. కొవిడ్‌పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఈ-క్రాప్‌పై దృష్టి ఉంచాలని సూచించారు. కచ్చితంగా అడ్వైజరి సమావేశాలు జరగాలని సీఎం స్పష్టం చేశారు. జగనన్న పచ్చతోరణం కింద ఆగస్టు 15 నుంచి 31 వరకు కోటి మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img