Friday, April 26, 2024
Friday, April 26, 2024

కొడాలి నానితో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల దృష్ట్యా రాష్ట్ర మంత్రి కొడాలి నానితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. కొడాలి నానితోపాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలకు అదనపు భద్రత కల్పించారు. మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2G2 గన్‌మెన్లతో పాటు అదనంగా 1G4 గన్‌ మెన్లను భద్రతగా ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాదు.. కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఇకపై కొడాలి నానికి 7G7 భద్రత ఉండనుంది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లకు కూడా ప్రస్తుతం ఉన్న 1G1 గన్‌మెన్‌లతో పాటు అదనంగా 3G3 గన్‌మెన్‌ భద్రతను ప్రభుత్వం ఇచ్చింది.ఇకపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు 4G4 భద్రత ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై. అధికార వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా ఫిర్యాదులు వచ్చాయని.. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల ఆధారంగా కొడాలి నాని, ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రతను పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి,..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img