Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ప్రస్తుతం గంజాయి స్మగ్లింగ్‌ మరింత ఎక్కువైంది : పవన్‌ కల్యాణ్‌

నేడు ట్విటర్‌ వేదికగా గంజాయి సమస్యపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. గంజాయి స్మగ్లింగ్‌ సమస్య అకస్మాత్తుగా తలెత్తలేదని, ఇది 15-20 ఏళ్లుగా ఉంది. నేను 2018 నుండి ఈ అంశాన్ని హైలైట్‌ చేస్తున్నాను. ప్రస్తుత వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్‌ మరింత ఎక్కువైంది. వైసీపీ ప్రభుత్వం ఈ ముప్పును అరికట్టాలని పేర్కొన్నారు. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ‘గంజాయి స్మగ్లింగ్‌’ అంశాన్ని సామాజిక-ఆర్థిక సమస్యగా చూడాలన్నారు. గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చట్టాన్ని అమలు చేయాలని ట్వీట్‌ చేశారు. సమాన ఉపాధి అవకాశాలను సమాంతరంగా సృష్టించాలంటూ 2018లో తాను గంజాయి గురించి మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img