Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ముందస్తుకు వెళ్తే జగన్ ముందుగా ఇంటికి వెళ్లటమే..

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని అలా ముందస్తుకు వెళ్తే ఘోర‌ ఓటమిపాలై ముందుగా ఇంటికి వెళ్లడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు రైతు కూలీలు నిరసన దీక్షలు చేపట్టి శుక్రవారంతో 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యాలయం నుండి మందడం గ్రామానికి రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఓ మూర్ఖపు ముఖ్యమంత్రి అని అభివర్ణించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా ప్రభుత్వానికి ప్రతికూల తీర్పు వచ్చిందని వివ‌రించారు. భారతీయ జనతా పార్టీ నేతలు రాష్ట్రంలో జగన్ ను విమర్శిస్తూ ఢిల్లీలో మాత్రం వత్తాసు పలుకుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img