Friday, April 26, 2024
Friday, April 26, 2024

రేపు మంత్రి పేర్ని నానితో ఆంధ్రా, సీమ డిస్ట్రిబ్యూటర్ల సమావేశం

సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సర్కార్‌ కఠినంగా వ్యవహరిస్తుండటంపై డిస్ట్రి బ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నానితో ఆంధ్రా, సీమ డిస్ట్రిబ్యూటర్ల భేటీ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు 20 మందితో సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం చెప్పిన ధరలకు థియేటర్లు నడపలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. థియేటర్లలో తనిఖీలు, స్వచ్ఛందంగా మూతపైనే ప్రధాన చర్చ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. అయితే టికెట్‌ ధరలు తక్కువగా ఉంటే సినిమా థియేటర్లను నడపలేమని సిని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తేల్చి చెబుతున్నారు.మంగళవారం సచివాలయంలో మంత్రి పేర్ని నానితో థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img