ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనులకు ప్రాధాన్యతనిస్తూ రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ఆది నుంచి గిరిజన సంక్షేమం, గిరిజన హక్కుల పరిరక్షణలకు టీడీపీ కృషి చేసిందని చెప్పారు. గిరిజన ప్రాతం భూములు, ఉద్యోగాలు, అటవీ హక్కులు వంటి వాటి కోసం ఆనాడు ఎన్టీఆర్ 14 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జీవోలు తెచ్చారని అన్నారు.