సీఎం జగన్ రెడ్డి చిత్రపటానికి జే బ్రాండ్ లిక్కర్ పోసి టీడీపీ శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు నిరసన తెలిపామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాలపై న్యాయ విచారణకు అంగీకరించే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు.