బీజేపి ఒక మోసకారి పార్టీ అని..ఒక శనిగ్రహమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. టీడీపీ, వైసీపీలు రాహుకేతువులని అన్నారు. టీడీపీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే.. వైసీపీ అరచేతిలో కైలాసం చూపిస్తోందన్నారు.దుష్ఠత్రయ పార్టీలైన బీజేపీ, టీడీపీ, వైసీపీలను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు.