Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాష్ట్రపతి ఎన్నిక..ఓటు వేసిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.సీఎం వైయస్‌ జగన్‌ తొలుత ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ఆర్‌ కే రోజా, ఉష శ్రీ చరణ్‌, తానేటి వనితా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి తర్వాత ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img