కేంద్రమంత్రులకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖలు
హంగేరికి అదనపు విమానాలు పంపి విద్యార్థుల తరలింపు వేగవంతం చేయాలని కేంద్రమంత్రులు జయశంకర్, జ్యోతిరాదిత్య సింధియా, హార్దిప్ సింగ్ పూరిలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖలు రాశారు. . సుమారు 507 మంది విద్యార్థులు రొమేనియా, హంగేరి సరిహద్దులు దాటి విమానాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను అభినందించారు.